కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని.
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్..
కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని.
హరీష్ రావు. స్పష్టంగా తెలియజేశారు. హుస్నాబాద్ రోడ్ షో లో భాగంగా హరీష్ రావు అంబేద్కర్ చౌరస్తాలో మాట్లాడుతూ. కాంగ్రెస్ నాయకులు దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు అలాంటి పనిచేయలేదని కేసీఆర్ గారు రైతులను ఆదుకున్నారని. పది సంవత్సరాల కాలంలో రైతు భరోసాతో రైతులను పంటకు ముందే పెట్టుబడి సాయం అందించి ఆదుకున్నారని చెప్పారు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు. రైతు బరోజగా రైతుబంధు డబ్బులు రైతులకు ఇవ్వలేదని. మనం కచ్చితంగా నిలదీసి అడిగితే తప్ప రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిధులు రైతులకు కేటాయించడం లేదని నిడదీశారు. గ్యారెంటీలలో భాగంగా ఏ ఒక్క గ్యారెంటీని సక్రమంగా అమలు చేయలేధని పేర్కొన్నారు. మొన్న జరిగిన ప్రధాని మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్లమీద పిలిచిన జనాలు ఎవరు రాలేదని. కాంగ్రెస్పార్టిసి ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నారో ఈ సభను బట్టి ఈ సభకు హాజరైన జనాలను బట్టి అర్థం చేసుకోవడం.ఒక రకంగా లోక్సభ ఎన్నికల్లో పార్టీకి త్వరలో తప్పదనినిర్ణయమైంది.
అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దేవుని పార్టీ అని నమ్మించి ప్రజలను మోసం చేస్తుందని గుడిని చూపించి ఓట్లు అడుగుతున్నారని అభివృద్ధిని చూపించి ఓట్లు అడగాలని. అయోధ్య రామ మందిరం బిజెపి పార్టీ సొంత డబ్బులతో పట్టినది ఏమీ కాదని ట్రస్టు ద్వారా నిర్మించినదేనని ప్రతి ఒక్క వ్యక్తి ప్రజలు నేను మా ఎమ్మెల్యే లందరూ ప్రతి ఒక్కరు చందాలు ఇవ్వడంతో ట్రస్టు తీసుకొని రామ మందిరం నిర్మించడం జరిగిందని.బిజెపి పార్టీ యొక్క సొంత డబ్బుతో కట్టలేదని హరీష్ రావు అన్నారు.
మన తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేసే కుట్ర జరుగుతుందని. ఇలాంటివి జరగకుండా ఆపాలంటే పార్లమెంట్లో మన ఎంపీ అభ్యర్థులు కనీసం 10 12 మందినీ గెలిపించుకోవలని చెప్పారు. ఈ రోడ్ షోలో హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే వడతల సతీష్ బాబు ఎమ్మెల్సీ ఎల్. రమణ ఎంపీపీ లక్ష్మి జెడ్పిటిసి భూక్యమంగా తదితరులు పాల్గొన్నారు.
