తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ప్రీ ఫైనల్స్ పరీక్షలు షురూ..టైం టేబుల్
తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి విద్యార్ధులకు పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నాయి. వీటికి ముందు నిర్వహించే ప్రీ ఫైనల్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక తెలంగాణలో మార్చి 6 నుంచి ప్రారంభం అవుతాయి. ఇవి ముగిసిన తర్వాత ఏపీలో మార్చి 17వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇక తెలంగాణలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో షెడ్యూళ్లు వచ్చేశాయి.
ఏపీ టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షల పూర్తి టైం టేబుల్ :
ఫిబ్రవరి 10వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్ ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1(కాంపోజిట్ కోర్సు) పరీక్షలు
ఫిబ్రవరి 11వ తేదీ సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష
ఫిబ్రవరి 12న ఇంగ్లిషు పరీక్ష
ఫిబ్రవరి 13న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 (కాంపోజిట్ కోర్సు), ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) పరీక్ష
ఫిబ్రవరి 15న గణితం పరీక్ష
ఫిబ్రవరి 17న భౌతిక శాస్త్రం పరీక్ష
ఫిబ్రవరి 18న జీవ శాస్త్రం పరీక్ష
ఫిబ్రవరి 19న ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్), ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ) పరీక్ష