జ్ఞాన తెలంగాణ,ఫరూఖ్ నగర్, షాద్నగర్ ప్రతినిధి డిసెంబర్ 31:
ఫరూక్ నగర్ మండలంలోని హాజిపల్లి, కిషన్ నగర్, రాస్మల్ల గూడ, నాగులపల్లి, లింగారెడ్డి గూడ గ్రామాల్లో బిజెపి సీనియర్ నాయకులు మిద్దె గణేష్ ఆధ్వర్యంలో 8 పోలింగ్ బూత్ కమిటీ లను ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథి గా బిజెపి సీనియర్ నాయకులు ఇస్నాతి శ్రీనివాస్ గారు హాజరై నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.214 పోలింగ్ బూత్ అధ్యక్షులు గా ఇస్నాతి మహేందర్,191 పోలింగ్ అధ్యక్షులు గా పాత్లావత్ వెంకటేష్,190 పోలింగ్ బూత్ అధ్యక్షులు గా రామకృష్ణ 189 పోలింగ్ బూత్ అధ్యక్షులు గా గడ్డం మల్లేష్, లింగారెడ్డి గూడ లో విష్ణువర్ధన్ రెడ్డి, రాస్మల్ల గూడ పోలింగ్ బూత్ అధ్యక్షులు గా శివ కుమార్ ను ఎన్నుకోవడం జరిగింది. శ్రీనివాస్ గారు మాట్లాడుతూజిల్లా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు 8 పోలింగ్ బూత్ లలో కమిటి లను వేయడం జరిగిందన్నారు.వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో బిజెపి జెండా ఎగురావేయాలని అన్నారు