UPI లో డబ్బులు పంపిస్తే ఛార్జీలు లేవు – కేంద్రం స్పష్టత

UPI లో డబ్బులు పంపిస్తే ఛార్జీలు లేవుకేంద్రం స్పష్టత

జ్ఞాన తెలంగాణ,డెస్క్ : యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధిస్తారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది.రూ.2,000కు పైగా ట్రాన్సాక్షన్ చేస్తే 1.1% ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని పలు టీవీ ఛానళ్లు, సైట్లు ప్రచారం చేస్తున్నాయని, ఇది పూర్తిగా అవాస్తవమని PIB ఫ్యాక్ట్చైక్ స్పష్టం చేసింది.సాధారణ UPI ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు లేవని తెలిపింది. డిజిటల్ వ్యాలెట్లైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రూమెంట్ల (PPI) పైనే ఛార్జీలు ఉంటాయంది.

— నల్లోల్ల శ్రీకాంత్
చీఫ్ ఎడిటర్,జ్ఞానతెలంగాణ,8008206714

You may also like...

Translate »