ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలి

ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించాలి
జ్ఞాన తెలంగాణ/ భద్రాచలం. జూన్ 11 :
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించి, ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐద్వా పట్టణ కార్యదర్శి సీతాలక్ష్మి, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి సతీష్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐద్వా డివైఎఫ్ఐ భద్రాచలం పట్టణ కమిటీల ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోసమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా,డివైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.