సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లా :ఏప్రిల్ 25
కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారి తో సహా ఆరుగురు చనిపో యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరు గురు ఘటనాస్థంలోనే చనిపోయారు. గాయపడిన ఇద్దరిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
